మెగాస్టార్-రవితేజ కుమ్మేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి దొంగా-పోలీస్ ఆట ఆడుతున్నారు. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమాలో చిరు ఓ దొంగ గా… ర‌వితేజ ఓ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నారు. చిరుని ప‌ట్టుకోవ‌డానికి ర‌వితేజ వేసే ఎత్తుగ‌డ‌ల నేప‌థ్యంలోనే సినిమా సాగుతుంద‌ని స‌మాచారం. వీరిద్ద‌రి మ‌ధ్య గేమ్ టిట్ ఫ‌ర్ టాట్‌లా ఉంటుంద‌ట.

 గత షెడ్యూల్‌లోనే రవితేజ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనగా.. తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభమైంది. సుదీర్ఘంగా ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో రవితేజ-చిరంజీవిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. హైదరాబాద్ ఈ లెంగ్తీ షెడ్యూల్ జరుగుతోంది. ఇతర నటీనటులతో పాటు చిరంజీవి కూడా ఇందులో భాగమయ్యారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన  శృతిహాసన్ నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ టార్గెట్ పెట్టుకొని షూటింగ్ పూర్తి చేస్తున్నారు.