గవర్నర్.. ఫక్తు పొలిటికల్ లీడర్

తనని పట్టించుకోని కేసీఆర్ సర్కార్ ను గవర్నర్ గవర్నర్‌ తమిళిసై కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించింది. అంతేకాదు.. బాధితులను రాజ్ భవన్ కు పిలిచి.. వారికి ఓదార్పు ఇస్తోంది. ఆదివారం ఆమె నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ (కు.ని.) బాధితులని పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తన వంతుగా తలో రూ. 10 వేల ఆర్థిక సాయం కూడా చేశారు. అంతేకాదు.. ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక సాయం అందేలా చూస్తానని చెప్పారు.  కు.ని. చికిత్సలు వికటించి నలుగురు చనిపోవడమనేది మామూలు విషయం కాదని.. ఆమోదయోగ్యం కూడా కాదని తమిళిసై అన్నారు. త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్‌.. ఇన్ఫెక్షన్‌ వల్లే ఈ ఘటన జరిగినట్లు ఓ డాక్టర్‌గా తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇటీవల కాలంలో గవర్నర్ దూకుడు చూస్తే.. ఆమె ఫక్తు పొలిటికల్ లీడర్ గా మారినట్టు కనబడుతుంది.