ప్రతి భారతీయుడిపై రూ.1.25 లక్షల అప్పు

తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం చేసిన అప్పుల లెక్కలను ఆయన బయటికి తీశారు. ట్విట్టర్ వేదికగా దీనిపై నిర్మలమ్మను ప్రశ్నించారు. 

2014 ముందు వరకు 67ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 14 మంది ప్రధానులు మారినా.. దేశ అప్పు రూ.56లక్షల కోట్లు ఉండేదన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ఎనిమిదేళ్లలో రూ.100లక్షల కోట్లకు అప్పు పెరిగిందని విమర్శించారు. ఫలితంగా ప్రతి భారతీయుడిపై రూ.1.25 లక్షల అప్పు ఉందని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్‌ ఈ అంశాలను కూడా ప్రస్తావించాలని కోరారు.

Madam FM waxes eloquent on Fiscal prudence;

Till 2014, in 67 years 14 Prime Ministers of India together have raised a debt of ₹ 56 Lakh Crores

Then came PM Modi Ji; in the last 8 years alone India’s debt incremented by ₹ 100 Lakh Crores

Every Indian has a debt of ₹1.25 Lakh— KTR (@KTRTRS) September 4, 2022