రేవంత్‌ చోరీలు.. నిజమేనా ?

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. సొంత నియోజకవర్గంలో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆత్మీయ పలకరింపులు, భారీగా చందాలతో ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గట్టుప్పల్‌ మండలంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

రేవంత్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు చోరీలు చేసేవారని వ్యాఖ్యానించారు. టీ పీసీసీ పదవి కోసం రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిగా పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కు పదవి ఇచ్చింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆయన కూడా కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వీరి పైట్ మరో లెవెల్ చేరిందని చె