ఆది పురుష్‌.. ఒక్క తెలుగులోనే వంద కోట్లు ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఆది పురుష్ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే థియేట్రికల్ రైట్స్ అమ్మేసినట్టు తెలిసింది.

‘ఆది పురుష్‌’ తెలుగు వెర్షన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.100 కోట్లకు యూవీ క్రియేషన్స్‌ ఈ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై గతంలో ప్రభాస్‌ ‘సాహో’లో నటించారు. ఇక ‘ఆది పురుష్‌’లో కృతిసనన్‌ సీతగా కనిపించనుంది. లంకేశ్‌గా ప్రతినాయకుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు.