లంకతో ఓటమి.. ఆసియా కప్ నుంచి భారత్ అవుట్

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. ఆసియా కప్ సూపర్ – 4 లో భాగంగా లంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 173/8 స్కోరు చేసింది.

అనంతరం లంక 19.5 ఓవర్లలో 174/4 చేసి విజయం సాధించింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్‌ (57), నిస్సాంక (52), భానుక రాజపక్స (25), డాసున్‌ శనక (33) రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 3, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.