నిధులిస్తారా? రెచ్చగొట్టి వెళ్తారా ?

ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కులం, మతం పేరుతో రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..  గతాన్ని తవ్వి వైషమ్యాలు రెచ్చగొట్టి మత పిచ్చిలేపి తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేపటి బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ సభను ఉద్దేశించి మండిపడ్డారు.


ప్రజలు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ దశాబ్దాల పాటు వెనక్కి పోయే ప్రమాదముందన్నారు. తెలంగాణకు పోరాటాలు కొత్త కాదని.. సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చే కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు తెలంగాణకు నిధులు తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌కు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి ఇప్పుడైనా చెప్తారా ? లేదంటే వర్గాల పేరుతో రెచ్చగొట్టి వెళ్తారో చూడాలి అన్నారు.