ప్రభాస్ ను కలిసిన రాజ్ నాథ్

టాలీవుడ్ లెజెండ్, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబాన్నికేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.

కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, ప్రభాస్‌ను పరామర్శించారు. కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు ధైర్యం చెప్పారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ నటుడు కృష్ణంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.