కృష్ణంరాజు స్మారక సభ.. 70 వేల మందికి భోజన ఏర్పాట్లు

కృష్ణంరాజు స్మారక సభ ఈ నెలాఖరున ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో జరుగుతుందని సమాచారం. ప్రభాస్ ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించనున్నారని తెలిసింది. ఈ నెల 29న మొగల్తూరు చేరుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ సభకు మొగల్తూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సుమారు 70 వేల మందికి ప్రభాస్‌ భోజన ఏర్పాట్లు చేయించనున్నారట. ప్రజలతో పాటు, కొందరు సినీ ప్రముఖులూ ఈ సభకు హాజరవుతారని సమాచారం. ద్ది రోజుల క్రితం కృష్ణంరాజు అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఆయన సంస్మరణ సభను నిర్వహించారు. అయితే కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులోనూ ఈ నెలాఖరున ఆయన స్మారక సభను నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.