23న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 30న పొన్నియిన్‌ సెల్వన్‌ తొలిభాగాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. 

చోళుల చరిత్రతో ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఇప్పుడీ.. ఈ నవల సినిమాగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు.  తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.