PFI కార్యాలయాలపై దాడులు.. 100 మందికి పైగా అరెస్ట్

దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఎన్‌ఐఏ, ఈడీ దాడులు చేపట్టాయి. దాదాపు 100 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పదికి పైగా రాష్ట్రాల్లో ఈ తనిఖీలు  జరిగాయి.

ఈ మొత్తం ఆపరేషన్‌ను కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. మొత్తం 200 మందికిపైగా ఎన్‌ఐఏ అధికారులు, ఇతర సిబ్బంది వీటిల్లో పాల్గొన్నారు.కేరళలోని మల్లపురం జిల్లా మంజేరిలోని పీఎఫ్‌ఐ ఛైర్మన్‌ సలాం ఇంటిపై అర్ధరాత్రి నుంచి ఎన్‌ఐఏ తనిఖీలు మొదలయ్యాయి. ఇవి ఇంకా కొనసాగుతున్నాయి.