కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి !

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్‌ బస్సు.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. పాలక్కాడ్‌ జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది.

టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.