చిరుకి గరికపాటి ఫోన్.. ఇష్యూ క్లోజ్ !

దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలాయ్’ కార్యక్రమంలో చిరంజీవి, గ‌రిక‌పాటి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో కూడా విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రుగుతోంది. ఈ వ్య‌వ‌హారంలో గ‌రిక‌పాటిదే త‌ప్పు అని చాలామంది బాహాటంగానే చెబుతున్నారు. గ‌రిక‌పాటి కాస్త సంయ‌మ‌నం పాటిస్తే బాగుండేద‌న్న‌ది అంద‌రి ఒపీనియ‌న్‌. ఇప్పుడు గ‌రిక‌పాటి కూడా త‌న త‌ప్పుని తెలుసుకొన్నార‌ని తెలుస్తోంది. చిరంజీవికి స్వ‌యంగా ఫోన్ చేసి మాట్లాడార‌ని, తాను ఏ ఉద్దేశంతో అలా అనాల్సివ‌చ్చిందో వివ‌ర‌ణ ఇచ్చార‌ని సమాచారం.

చిరు కూడా గ‌రిక‌పాటికి స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశార‌ని, ఈ వ్య‌వ‌హారాన్ని ఇంత‌టితో ముగింపు ప‌ల‌కాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరు గ‌రిక‌పాటి ఎపిసోడ్ కి మీడియా సాక్షిగా ఓ ముగింపు వాక్యం ప‌లికే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌త్యేకంగా ఓ వీడియో బైట్ రిలీజ్ చేసి, గ‌రిక‌పాటి వ్య‌వ‌హాక‌రానికి పుల్ స్టాప్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో చిరు ఉన్నార‌ని స‌మాచారం.