ప్రజారాజ్యం బాధ నుండి పుట్టిందే జనసేన

మెగాస్టార్ చిరంజీవి మెల్లమెల్లగా తమ్ముడు పార్టీ జనసేనకు దగ్గర అవుతున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ లో లేకున్నా.. ఇప్పటికిప్పుడు జనసేనలో చేరకున్నా.. తన సపోర్ట్ మాత్రం తమ్ముడి పార్టీకే ఉంటుందని ఆయన ప్రకటించారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో పలు మార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం కోసం చిరు ఆస్తులు అమ్ముకున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.  తొలిసారి గా చిరంజీవినే ప్రజారాజ్యం పార్టీ కోసం విలువైన ఆస్తి అమ్ముకున్నారని వెల్లడించారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో ఎన్వీ ప్రసాద్ కాస్త ఆవేశంగానే ప్రసంగించారు. చెన్నయ్ ప్రసాద్ ల్యాబ్ సమీపంలోని అత్యంత విలువైన స్థలాన్ని పార్టీ నడపడానికి చేసిన అప్పుల కోసం చిరు అమ్మేసిన వైనాన్ని ఎన్వీ ప్రసాద్ వెల్లడించారు. ప్రజారాజ్యం విషయంలో జరిగిన పొరపాట్లకు సమాధానమే జనసేన పార్టీ అని ఎన్వీ ప్రసాద్ అనడం విశేషం.