ధ‌నుష్-ఐశ్వ‌ర్య దారిలో సామ్-చైతూ ?

ఇటీవ‌ల ధ‌నుష్ – ఐశ్వ‌ర్య ఇద్ద‌రూ విడాకులు కోరుతూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని వారిద్ద‌రూ అధికారికంగానే ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు విడాకులు వెన‌క్కి తీసుకొని, క‌లిసి జీవించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ వీరిద్దరిని తిరిగి కలిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విడిపోయిన కొడుకు-కోడలు.. నాగ చైతన్య-సమంతలను కలిపే ప్రయత్నం నాగార్జున ఎందుకు చేయడం లేదని అక్కినేని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
 
సెల‌బ్రెటీలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవ‌డం మామూలే. అందులో చాలా జంట‌లు విడాకులు తీసుకొన్నాయి. అయితే విడాకులు తీసుకొన్న త‌ర‌వాత వాటిని ర‌ద్దు చేసుకొని, ఇలా మ‌ళ్లీ క‌లిసిపోవాల‌నుకోవ‌డం ధ‌నుష్ – ఐశ్వ‌ర్య లకే దక్కనుంది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఎమోషన్ వీరిద్దరిని కలపడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అయితే చై-సామ్ విషయంలో ఈ ఎమోషన్  పని చేయదు. పైగా వీరిద్దరు ఒకరిపై మరొకరు పీకల్లోతూ కోపంలో ఉన్నారు. అందుకే ఆ దిశగా నాగ్ కూడా ప్రయత్నాలు చేయడం లేదని అక్కినేని అభిమానుల్లో కొందరు సమర్థిస్తున్నారు.