నువ్వు ఎప్పటికీ ఒంటరిగా నడవవు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత.. కొన్నాళ్లుగా కామ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపై అభిమానులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన పెంపుడు జంతువు ఫొటోను షేర్‌ చేసిన సమంత ‘‘వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు’’ అని క్యాప్షన్‌ రాసింది. దీంతో ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఇక తాజాగా సమంత తన సెల్ఫీని షేర్‌ చేసింది. అయితే అందులో తన ముఖం కనపడకుండా ఒక పవర్‌ఫుల్‌ మెస్సేజ్‌ ఇచ్చింది. ‘నువ్వు ఎప్పటికీ ఒంటరిగా నడవవు’ అని రాసి ఉన్న టీ షర్ట్‌ వేసుకొని ఉన్న పిక్‌ను పంచుకుంది. సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు ఆమె వరుణ్‌ ధావన్‌తో కలసి చేయనున్న ‘సిటాడెల్‌ ఇండియా’ వెబ్‌సిరీస్‌ ఈ ఏడాదిలో ప్రారంభం నుంది.