సరోగసి వివాదం.. క్లారిటీ ఇచ్చిన నయన్ దంపతులు !

సరోగసి విధానం ద్వారా నయనతార-విఘ్నేశ్ శివన్ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి పద్ధతిలో కవలలు జన్మించడంతో నెటిజన్లు వీరిపై సీరియస్ అవుతున్నారు. ఈ విధానంలో పిల్లలకు జన్మనివ్వడాన్ని మన దేశంలో నిషేధించారు. ఆ చట్టం ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చింది.

ఈ కారణంగా చట్టాన్ని అతిక్రమించారంటూ నెటిజన్లు నయన్-విఘ్నేశ్‌పై ఫైర్ అవుతున్నారు. అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా విఘ్నేశ్ శివన్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ రూపంలో ఈ అంశంపై క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. “అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అంతవరకు ఓపికపట్టండి.. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి” అంటూ స్టోరీలో షేర్ చేశారు.