మునుగోడును దత్తత తీసుకుంటా : కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చండూరులో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రూ.వేలకోట్ల కాంట్రాక్టుల లాభాలతో మునుగోడు ఓటర్లను అంగడి సరకులా కొనేందుకు సిద్ధమైన కాంట్రాక్టర్‌ అహంకారానికి.. మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని చెప్పారు. 

ప్రజలకు అవసరం లేకపోయినా బలవంతంగా రుద్దిన ఎన్నిక ఇది అని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని కేటీఆర్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.