హైదరాబాద్ లో ఐటీ దాడులు.. వాళ్లే టార్గెట్ !

హైదరాబాద్‌లో పలు వ్యాపార సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఏక కాలంలో పలు వ్యాపారసంస్థలపై  ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. నగర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు మొబైల్ కంపెనీల షోరూమ్‌లలో సైతం ఐటీసోదాలు జరుగుతున్నాయి. ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్‌లో ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్ లోని ఆరు చోట్ల తాజాగా ఐటి అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.

షాపింగ్ మాల్స్ కు చెందిన ఆఫీసులతో పాటు వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. కూకట్ పల్లి , కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్‌ సహా మరో పది చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థలలో ఐటి అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్‌తో పాటు వాటి అనుబంధ సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.