టీ20 వరల్డ్ కప్ : బుమ్రా స్థానంలో షమీ

భారత స్టార్ బౌలర్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌ కు దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా స్థానంలో జట్టులోకి మహమ్మద్‌ షమిని తీసుకుంటున్నట్లు తాజాగా బీసీసీఐ ప్రకటన చేసింది. ఇక స్టాండ్‌ బైగా ఉన్న దీపక్‌ చాహర్‌ సైతం గాయం కారణంగా టోర్నీకి దూరమవడంతో మహమ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌లను ఎంపిక చేసింది.

శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌ను రిజర్వ్‌ ఆటగాళ్లుగా తీసుకొన్న విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకొని ప్రాక్టీస్‌ను కూడా మొదలుపెట్టింది. ఈ నెల 16 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నెల 23న భారత్ తన తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో తలపడనుంది.