మునుగోడు బరిలో 47 మంది

మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.

మిగిలిన 83 మంది అభ్యర్థు్ల్లో 36 మంది ఇవాళ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 47మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోటీలో 47 మంది ఉన్న ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఉండనుంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.