భారత్‌లో కరోనా కొత్త వేవ్‌ తప్పదా ?

ఒమిక్రాన్ కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఇప్పటికే చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదలకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్‌ 7  పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడానికి కారణం ఈ కొత్త వేవ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో దీపావళి సెలవుల వేళ ఈ కొత్త వేరియంట్ దేశంలో మరో కొత్త వేవ్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్ల వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకమని నిపుణులు అంటున్నారు.