‘భేడియా’ ట్రైలర్‌ టాక్

వరుణ్‌ ధావన్‌ – కృతిసనన్‌ జంటగా నటించిన బాలీవుడ్ హారర్‌ కామెడీ చిత్రం ‘భేడియా’. అమర్‌ కౌశిక్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం ‘భేడియా’ ట్రైలర్‌ విడుదల చేసింది.

తోడేలుగా మారిన వ్యక్తిగా వరుణ్‌ ధావన్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ఉదయం పూట సాధారణమైన యువకుడిగా కనిపిస్తూనే రాత్రి వేళల్లో తోడేలుగా మారి, ఇతరులపై దాడి చేయడం వంటి సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది.  ఒక తోడేలు నా శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఉన్నట్టుండి డ్రాకులా వంటి పదునైన కోరలు, పంజా.. తోక కూడా వస్తుంది. ఒకవేళ నాకు నయం కాకపోతే నేను మనుషులను తింటూనే ఉంటానని ట్రైలర్ లో వరుణ్ ధావన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.