కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే గెలుపు

ఎట్టకేలకు వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఖరారయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే కైవసం చేసుకున్నారు. తన ప్రత్యర్థి శశిథరూర్‌పై ఘన విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో దాదాపు 9500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా.. థరూర్‌కు మద్దతుగా 1072 మంది ఓటేశారు. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 37 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో తాజా ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి హస్తం పార్టీ పగ్గాలు అందుకుంటున్నారు.