కత్రినా.. సౌత్ లవ్ !

ఒకప్పుడు సౌత్ సినిమాల్లో నటించాలంటే.. బాలీవుడ్ హీరోయిన్లు మొహం తిప్పిసేసుకునేవారు. డబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చినా.. నటించేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్టార్ హీరోయిన్లు అందరూ సౌత్ పై మనసు పారేసుకుంటున్నారు. సౌత్ లో నటించడమే తమ ముందున్న పెద్ద లక్ష్యంగా చెబుతున్నారు. తాజాగా ఈ లిస్టులో కత్రినా కైఫ్ చేరారు.

మణిరత్నం రూపొందించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంపై కత్రినా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కత్రినా.. మంచి కథ, బలమైన పాత్రలు ఉంటే నాకు నటించడానికి భాష అడ్డం కాదు. నాకు సౌత్‌ఇండియన్‌ సినిమాలు చేయాలని ఉంది. దక్షిణ భారతదేశంలో చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు. దానికి ఉదాహరణ ఇటీవల విడుదలైన పొన్నియిన్‌ సెల్వన్‌1. ఎంత అద్భుతమైన చిత్రం అది. అందులోని ప్రతి సన్నివేశాన్ని మణిరత్నం ఎంతో గొప్పగా తీశారు. ఆ సినిమా సంగీతం కూడ ఎంత బాగుందో. దర్శకుడు ఇంత పెద్ద స్థాయిలో సినిమా తీసి తన సత్తా నిరూపించుకున్నారని చెప్పుకొచ్చింది.

తెలుగు సినిమా మల్లీశ్వరి సినిమాతో కత్రినా తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత మరోసారి టాలీవుడ్ వైపు చూడలేదు. కత్రినా కైఫ్‌ నటించిన ‘ఫోన్‌ భూత్‌’ నవంబర్‌4న థియేటర్లలోకి రానుంది.