చేరితే రూ. 100 కోట్లు.. చేర్పిస్తే మరో రూ. 50 కోట్లు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీశ్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్‌కు చెందిన నందకిశోర్‌(ఏ2), తిరుపతికి చెందిన సింహయాజి (ఏ3)పై కేసు నమోదు కేసినట్లు రాజేంద్రనగర్‌ ఏసీపీ తెలిపారు. ముగ్గురిపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

ఇక బీజేపీలో చేరితే రూ.100కోట్లు ఇప్పిస్తామని రోహిత్‌రెడ్డికి సతీష్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతీ ఆఫర్ చేశారని.. నందకిశోర్‌ (నందు) మధ్యవర్తిత్వంతో ఫామ్‌హౌస్‌కు సతీష్‌ శర్మ, సింహయాజి వచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేసినట్లు రోహిత్‌ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.