కేజీఎఫ్‌ హీరోకు బాలీవుడ్ ఆఫర్లు

కేజీఎఫ్‌-2 సినిమా తర్వాత యశ్‌ తన తర్వాత ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. అయితే బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు నిర్మాతలు యశ్‌ను సంప్రదించినట్లు సమాచారం. బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ అనే పౌరాణిక ఇతిహాసాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం చిత్రబృందం యశ్‌ను సంప్రదించిందిట.

అలానే బ్రహ్మాస్త్ర-2 కోసం ఆ సినిమా నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇటీవల యశ్‌ని కలిశారట. అందులోని దేవ్‌ పాత్రలో నటించాల్సిందిగా కోరినట్లు సమాచారం. అయితే ఈ రెండు ప్రాజెక్టుల్లో యశ్‌ ఏ సినిమాకు ఓకే అంటారో అన్నది ఆసక్తిగా మారింది. సౌత్ నుంచి ప్రభాస్ తర్వాత.. ఆ రేంజ్ లో ఫాలోయింగ్ కలిగిన హీరోగా యష్ గుర్తింపు తెచ్చుకున్నారు.