‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ ప్రకటించిన రాజమౌళి

సూపర్‌హిట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సీక్వెల్‌ ఉంటుందని దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’ గురించి ఇప్పటికే చర్చలు సాగాయని, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను రాసే పనిలో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.


సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి  నెక్స్ట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విభిన్న యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఆ సినిమా స్క్రిప్టు దశలోనే ఉంది. మహేశ్‌బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక మహేశ్‌.. రాజమౌళి చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఇక  ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’ తీయాలంటే అటు రామ్‌చరణ్‌, ఇటు ఎన్టీఆర్‌ డేట్స్‌ ఖాళీగా ఉండాలి. వీరిద్దరు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులకు కమిట్‌ అయి ఉన్నారు. ఈ హీరోలు అప్పటికే తమ సినిమాలు పూర్తి చేసి ఈ క్రేజీ సీక్వెల్‌ కోసం కలవాలంటే కనీసం మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశాలున్నాయి.