ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ


మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం తర్వాత.. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు పోయేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఆ ఆలోచనే లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్వయంగా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.  ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.