ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతుల మృతి

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లిలో కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులు రమ్య, గోపీనాథ్‌, వారి పిల్లలు సాహిత్‌, హాసిని, మరో బంధువుతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. పర్వతదేవరపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి కారు కల్వర్ట్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రమ్య, గోపీనాథ్‌ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారి బంధువు తారకేశ్వరి, చిన్నారులు సాహిత్‌, హాసిని తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొంతుదూ తారకేశ్వరి(62) మృతి చెందారు. చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు.