వీరమల్లుకు లైన్ క్లియర్

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల మూడ్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. సినిమా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయాలని ఇప్పటికే పవన్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు కూడా ఆగిపోనుంది అనుకున్నారంతా. కానీ వీరమల్లు కు లైన్ క్లియర్ అయింది.

శుక్రవారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌కి ముందు ప్రత్యేకంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో కూడా పాల్గొన్నారు పవన్‌కల్యాణ్‌. 
మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. సమ్మర్ లో రిలీజ్  చేయడమే లక్ష్యంగా చిత్రీకరణ కొనసాగుతోంది. క్రిష్‌  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు.