వారసుడు సంక్రాంతి రిలీజ్ పై.. కోలీవుడ్ ఆగ్రహం !

విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారిసు’. దిల్‌రాజు నిర్మాత. యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. సంక్రాంతి కానుకగా దీన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటన ఇప్పుడు వివాదస్పదంగా మారింది.

సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై తమిళనాడు వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఫైర్ అయ్యారు.  ఇరు ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఇదే మరోసారి రిపీట్‌ అయితే తర్వాత ఏం చేయాలో మేమూ చూస్తామని లింగుస్వామి హెచ్చరించారు.