వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా భైంసా సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీకి ఒక్కసారి అవకాశమివ్వండని సంజయ్ కోరారు. రాష్ట్రంలో నిలువనీడలేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక  బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల కోసం బీజేపీ ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉందన్నారు.