మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి

ఐయామ్ ఎ ప్లాప్ పొలిటిషన్. కానీ పరాజయంలోనే జయం ఉంటుంది అన్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.  శనివారంహైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఫేసింగ్‌ ది ప్యూచర్‌’ అంశంపై  సీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

“నా పరాజయాల గురించి నిర్భయంగా మాట్లాడుతా. పరాజయంలోనే జయం ఉటుంది. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మొద్దు. దేవుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి’’ అని పవన్‌ అన్నారు.