టీమిండియా విజయాన్ని అడ్డుకున్న మెహిదీ హసన్‌

తొలి వన్డేలో భారత్ పై బంగ్లాదేశ్ గెలుపొందింది. భారత్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

154 పరుగుల వద్ద బంగ్లా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియా విజయం ఖాయం అనుకున్నారు. కానీ చివర్లో మెహిదీ హసన్‌ (38; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి బంగ్లాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్ 3, కుల్‌దీప్‌ సేన్‌ 2, వాషింగ్టన్‌ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్‌, దీపక్ చాహర్‌ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం (డిసెంబర్‌ 7) జరగనుంది.