మహేష్-రాజమౌళి సినిమా.. జూన్ నుంచి రెగ్యులర్ షూట్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి నెక్స్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథను  రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ సిద్ధం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్‌ మేజర్ అప్ డేట్ ఇచ్చారు.  ఎన్నో రోజుల నుంచి రాజమౌళి ఇలాంటి సాహసోపేతమైన కథను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. మహేశ్‌ బాబు యాక్షన్‌ సన్నివేశాలు చూస్తే చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది.‌ ఈ కథకు మహేశ్‌ సరిగ్గా సరిపోతాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రదేశాల్లో చిత్రీకరించాలని అనుకుంటున్నాం. వచ్చే ఏడాది జూన్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు.