ఐశ్వర్య లక్ష్మి రెండు చేదు అనుభవాలు

కేరళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి ‘అమ్ము’తో మంచి విజయాన్ని అందుకుని, తెలుగువారికి చేరువైంది. ప్రస్తుతం ఆమె ‘మట్టి కుస్తీ’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జీవితంలో ఎదురైన రెండు చేదు అనుభవాలు పంచుకుంది.

చిన్నప్పుడు తనతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, ఇప్పటికీ ఆ చేదు ఘటన తనకు గుర్తుందన్నారు. ఇటీవల సినిమా ప్రమోషన్స్‌ కోసం కోయంబత్తూర్‌కు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ఘటననే ఎదుర్కొన్నా. వెంటనే ప్రతిఘటించానని చెప్పుకొచ్చింది.