పార్టీ పదవులు నాకో లెక్కనా ?

మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా ? అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్ది. రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ భారీ కార్యవర్గాన్ని శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే పీఏసీ, పీఈసీల్లో ప్రజా ప్రతినిధులకు చోటు కల్పించిన అధిష్ఠానం.. ఆ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు కల్పించలేదు. ఈ నేపథ్యంలో వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ కండువా ఉంది.. మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై మాట్లాడను. మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా ? అన్నారు.  భవిష్యత్తులో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని తెలిపారు.