గోవింద నామ్ మేరా.. రణబీర్ స్వీట్ సప్రైజ్ !

విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్ లీడ్ రోల్స్ లో నటించిన బాలీవుడ్ చిత్రం “గోవింద నామ్ మేరా”. శుక్రవారం (డిసెంబర్ 16) రిలీజైంది. డిస్నీప్లస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ లో డ్యాన్స్, రొమాన్స్ మరియు మర్డర్ మిస్టరీకి ఆకట్టుకుంది. అయితే.. ప్రేక్షకులు ఊహించనిది రణబీర్ కపూర్ గెస్ట్ రోల్. రణబీర్ కనిపించేది కొద్దిసేపే అయినా.. ప్రేక్షకులకు ఫుల్ కిక్కునిచ్చాడు.

రణబీర్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం ‘ తూ ఝూతి మే మక్కార్ ‘ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. కూడా నటించబోతున్నాడు. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్ లో యానిమల్‌ సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.