‘కాంతార 2’ నెల రోజుల తర్వాత !

 ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ‘కాంతార’.  ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా కాంతార 2 అప్ డేట్ ఇచ్చారు నిర్మాతలు.

‘కేజీఎఫ్‌’, ‘కేజీఎఫ్‌2’ నిర్మాతలు విజయ్‌ కిరగందూర్‌, చాలువే గౌడలు.. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై కాంతార ను నిర్మించారు. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ..  ‘కాంతార’కి సీక్వెన్స్‌ నిర్మించే ఆలోచన ఉందన్నారు. రిషబ్‌ శెట్టి ఒక నెల విరామం తీసుకుంటానన్నారు. ఆయన తిరిగొచ్చాక ఫ్రాంఛైజీ చిత్రం అడుగులు పడతాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.