‘ప్రాజెక్ట్ కె’ నైజాం @70 కోట్లు

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’. 2024లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సినిమా నైజాం హక్కులను రూ. 70 కోట్లకు అమ్ముడిపోయినట్లు సమాచారం.

ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తున్నారు. మరో హాట్ భామ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సలార్, ఆదిపురుష్ సినిమాల తర్వాత ప్రాజెక్ట్ కే ప్రేక్షకుల ముందుకు రానుంది.