దుబాయ్‌లో న్యూ ఇయర్ పార్టీ

ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను పలువురు సెలబ్రిటీలు దుబాయ్‌లో చేసుకున్నారు. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ-అనుష్కశెట్టి, కె.ఎల్‌ రాహుల్‌-అతియాశెట్టి, బాలీవుడ్‌ జోడీ సిద్దార్థ్‌ మల్హోత్ర-కియారా అడ్వాణీ కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేడుకల్లో పాల్గొన్నారు. కోహ్లీ-అనుష్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కొన్ని రోజుల ముందే వీళ్లిద్దరూ తమకెంతో ఇష్టమైన దుబాయ్‌కి వెళ్లారు. 

మరోవైపు, మరో ఇండియన్‌ క్రికెటర్‌ కె.ఎల్‌.రాహుల్‌ సైతం దుబాయ్‌ వేదికగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. తన ప్రియురాలు, నటి అతియా శెట్టితో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ జోడీ ఫొటోలు నెట్టింటిలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగనుందని బీటౌన్‌లో కొంతకాలంగా టాక్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బీటౌన్‌ సెలబ్రిటీ కపుల్‌ కియారా అడ్వాణీ, సిద్దార్థ్‌ మల్హోత్ర కూడా దుబాయ్‌లోనే న్యూ ఇయర్‌ పార్టీ చేసుకున్నారు. మనీశ్‌ మల్హోత్ర ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఈ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఓ కోటలో మూడు రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు జరిగనునట్లు సమాచారం.