పోరాడి ఓడిన టీమిండియా

శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలి బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్ (52), నిశాంక (33), చరిత్ అసలంక (37), చివర్లో డాసున్‌ శనక (51) రాణించారు.  భారత బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్ రెండు, చాహల్‌ ఒక వికెట్‌ తీశారు.

207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ బ్యాటర్లు.. వరుసగా పెలివియన్ కు  క్యూ కట్టారు. ఇషాన్‌ (2), గిల్‌ (5), త్రిపాఠి (5), కెప్టెన్‌ హార్దిక్ పాండ్య (12) ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే  అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్ రాణించడం, ఆఖర్లో శివమ్ మావి (26, 15 బంతుల్లో) అదరగొట్టడంతో..  టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.16 పరుగులతో తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్ 1-1 సమం అయింది.