ఇంకా కసి తీరలేదు

ఎన్నో రకాలు సినిమాలు చేశాను. కానీ ఇంకా కసి తీరలేదు అన్నారు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. శృతిహాసన్ హీరోయిన్. థమన్ సంగీతం. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథంలో శుక్రవారం ఒంగోలు వేదికగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ” అభిమానులకి ఈ రోజు నుంచే సంక్రాంతి పండగ మొదలైంది.  ఈ వేడుకకి పెద్దరికాన్ని తీసుకొచ్చారు దర్శకుడు బి.గోపాల్‌. ఆయనతో చేసిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. నా జీవితాశయం చెంఘీజ్‌ఖాన్‌ సినిమా. కచ్చితంగా చేస్తా. ఒంగోలుకే చెందిన  మా దర్శకుడు గోపీచంద్‌ మలినేని కూడా నా అభిమానే. ఆయనతో ఇంత గొప్ప సినిమా చేయడం గర్వంగా ఉంది. ఇప్పుడు ఫ్యాక్షన్‌ ఎందుకు అంటారేమో. కానీ దీని వెనక రామాయణం మహాభారతం లాంటి చాలా కథలు ఉన్నాయి. ఆదిత్య 369, భైరవద్వీపం తదితర చిత్రాల్లాగా చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా నిలవబోతోంది ‘వీరసింహారెడ్డి’. నటనలో విశ్వరూపం, వేషధారణలో దశావతారం, హనీరోజ్‌కి తెలుగులో మొదటి సినిమానే అయినా, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన విధానం అద్భుతం. దునియా విజయ్‌ అద్భుతమైన పాత్ర చేశారు. ఈ సినిమా బాగా ఆడి తీరుతుంది” అన్నారు