‘పఠాన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. సరికొత్త రికార్డు

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయినవి. అంతేకాదు.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. తొలివారం దాదాపు అన్ని చోట్ల టికెట్లు తెగాయి. 

ఈ చిత్రంలో  జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ప్రచార చిత్రాలు అదరిపోవడం, చాలా గ్యాప్ తర్వాత షారుక్ నుంచి సినిమా వస్తుండటంతో పఠాన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమాల కు సంబంధించి అనవసర రాద్ధాంతాలు చేయొద్దని స్వయంగా ప్రధాని మోడీ బీజేపీ శ్రేణులను హెచ్చరించడంతో.. అన్ని రకాల అడ్డంకులు తొలగినట్టయింది.