‘కాంతార’ ప్రీక్వెల్ పనులు షురూ ! రిలీజ్ ఎప్పుడంటే ?

గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు-నటుడు రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురిశాయి. ఈ సినిమా సీక్వెల్ రాబోతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ అని తెలుస్తోంది.

ఇటీవల కొద్దిరోజులు విహార యాత్ర కోసం ఫారిన్ వెళ్లిన రిషబ్ శెట్టి తిరిగొచ్చారు. వచ్చి రాగానే కాంతార ప్రీక్వెల్ స్క్రిప్ట్ పనులు షురూ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.