రెండు భాగాలు దసరా.. క్లారిటీ ఇచ్చిన నాని !

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ హీరోయిన్. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే దసరా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఈ ప్రచారంపై నాని స్పందించారు. జస్ట్ వన్. కానీ డబుల్, త్రిబుల్ ఎఫెక్ట్ తో రానుందని నాని ట్వీట్ చేశారు. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బ్యాక్‌డ్రాప్‌లో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దసరా సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో ధ‌ర‌ణి అనే పాత్ర‌లో నాని క‌నిపిస్తున్నాడు. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో నాని న‌టిస్తోన్న ఈసినిమా ఇది. ఈ క్యారెక్ట‌ర్ కోసం త‌న లుక్‌, గెట‌ప్ పూర్తిగా మార్చుకొనన‌టిస్తున్నాడు.