తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు షురూ !

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఆ మధ్య బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోబోతుంది అనే ప్రచారం జరిగింది. అంతేకాదు.. కాంగ్రెస్ లోని కోవర్టుల బృందం ఒకరి తర్వాత మరొకరు కారెక్కబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనబడుతుంది. బీఆర్ ఎస్ నేతలు చాలా మంది కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత గుర్నాథరెడ్డి ఆయన కొడుకు, కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అంటూ ఫోటోలు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు రేవంత్. భారత్ జోడో,హాత్ సే హాత్ జోడో పై చర్చ జరిగింది. శ్రీ మల్లికార్జున ఖర్గే గారితో తనకున్న అనుబంధాన్ని గురునాథ్ రెడ్డి గుర్తు చేసుకున్నారని రాసుకొచ్చారు. అయితే అతి త్వరలో తండ్రి-కొడుకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం.