పార్లమెంట్ రద్దు చేయండి.. కేటీఆర్ సవాల్ !


కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ముందస్తు ఎన్నికలకు మేం రెడీ.. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి అని సవాల్ విసిరారు.నిజామాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా  కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. స్థానిక ఎంపీ అర్వింద్‌పై ఘాటు విమర్శలు చేశారు. గత ఎనిమిదేళ్లుగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా. రూపాయి కూడా తీసుకురాలేదు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు మోడీ సర్కార్ కు ఆఖరి బడ్జెట్ సమావేశాలు. ఈసారైనా.. తెలంగాణ కు ఏం చేశామో.. చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా ? అని ప్రశ్నించారు.