ధనుష్-త్రివిక్రమ్-పవన్.. సార్ సూపర్ !

ఒకే వేదికపై కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కనిపించబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సినిమా ‘సార్’. ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో త్రివిక్రమ్ కు నిర్మాణ భాగస్వామ్యం ఉంది. ఆయన భార్య సాయి సౌమ్య సహా నిర్మాత.

ఈ నేపథ్యంలో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘సార్’ ప్రమోషన్స్ ను త్రివిక్రమ్ కూడా బాధ్యత గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14న హైదరాబాద్ లో జరగబోతున్న సార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్  కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారని.. రావడానికి ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం. దీంతో సార్ వేదికపై ధనుష్-త్రివిక్రమ్-పవన్ కనిపించబోతున్నారు.

విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఆవిష్క‌రిస్తూ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెర‌కెక్కించారు. సార్ ధ‌నుష్‌కు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా న‌టిస్తున్నాడు. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.